తొలిసారిగా దుబాయ్ లో 'యు.ఏ.ఈ తెలుగు వైద్యుల' ఆత్మీయ సమావేశం 2016
- October 09, 2016
దుబాయ్ లో మొట్టమొదటిసారిగా యు.ఏ.ఈ తెలుగు వైద్యుల ఆత్మీయ సమావేశం 2016 కు విశేష స్పందన లభించింది. దాదాపు100 మంది తెలుగు వైద్యులు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో 350 మందికి పైగా హాజరైనారు. పలువురు తెలుగు వైద్యుల కూడిక ద్వారా అద్భుతమైన పరస్పర అవగాహన కొనసాగడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. తెలుగు వైద్యుల మధ్య తొలిసారిగా జరిగిన ఈ కార్యక్రమం వాతావరణం పండుగ సందడిని మరిపించింది. ఈ సమావేశం ద్వారా తొలిసారిగా ఒకరినొకరు పరిచయం చేసుకొని ఆత్మీయంగా సంభాషించుకొన్నారు. వైద్యులు తమను తాము పరిచయం చేసుకొని ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. శ్రీ రియాజుద్దీన్ ద్వారా "యుఎఇ మెడికల్ ఎడ్యుకేషన్" గూర్చి ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత డాక్టర్.రాజీవ్ లోచన్ ద్వారా "ఆరోగ్యకరమైన గుండె" గూర్చి ఒక చక్కని సందేశం అందచేయబడింది. యుఎఇ తెలుగు వైద్యుల ఆత్మీయ సమావేశం 2016 నిర్వాహక సభ్యులు డాక్టర్ హరీష్, జాఫర్ ఆలీ, కేసరి త్రిమూర్తులు, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ కోడి రామ, డాక్టర్ నారాయణ, డాక్టర్ సౌజన్య, డాక్టర్ వెంకట సీతా రాంబాబు ఉన్నారు.ఈ కార్యక్రమములో మన తెలుగు వారు దువ్వూరు కిషోర్ బాబు,తులసి ప్రసాద్, అరుణ్ కుమార్, శ్యామ్,గౌస్ మొహమ్మద్ ,శ్రీకాంత్ చిత్తర్వు తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







