'మిక్చర్‌పొట్లం' సినిమా ప్రెస్ మీట్

- October 09, 2016 , by Maagulf

భానుచందర్‌ తనయుడు జయంత్‌ కథానాయకుడిగా సతీష్‌కుమార్‌ ఎం.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిక్చర్‌పొట్లం'. శ్వేతాబసు ప్రసాద్‌ కథానాయిక. లక్ష్మీ ప్రసాద్‌, వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావులు నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రం బృందం మాట్లాడింది. 'అమలాపురం నుంచి షిరిడీ వెళ్లే బస్సు ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రమని, శ్వేత నటన ఆకట్టుకుంటుందని' తెలిపింది. అలీ, గీతాంజలి, భానుచందర్‌, కృష్ణభగవాన్‌, సుమన్‌, పోసాని తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com