ఇథియోపియా లో ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం
- October 09, 2016
అడిస్ అబాబా (ఇథియోపియా): దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అడ్డుకునేందుకు ఇథియోపియా ప్రభుత్వం ఆదివారం నాడు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఒరామియా ప్రాంతంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోవటం, ఆస్తినష్టం జరగటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ శక్తులతో కుమ్మక్కయి దేశంలో శాంతికి విఘాతం కలిగిస్తున్న శక్తులను ఏరిపారేసేందుకు వీలుగా శనివారం సాయంత్రం నుండి దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి తేవాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు ఇథియో అధికార మీడియా ఆదివారం ఉదయం వెల్లడించింది.
నిరసనల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలలో జరిగిన ప్రాణ, ఆస్తినష్టంపై చర్చించిన మంత్రిమండలి ఎమర్జెన్సీ విధించాలని ప్రధాని హైలేమరియం దెసాలెన్కు సిఫార్సు చేసినట్లు మీడియా తన వార్తా కథనాలలో వివరించింది. ఆదివారం ఉదయం నుండి దేశంలోని అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగినట్లు స్థానికులు వెల్లడించారు. నిరసనకారులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం గత వారం రోజులుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









