ఇథియోపియా లో ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం
- October 09, 2016
అడిస్ అబాబా (ఇథియోపియా): దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అడ్డుకునేందుకు ఇథియోపియా ప్రభుత్వం ఆదివారం నాడు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఒరామియా ప్రాంతంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోవటం, ఆస్తినష్టం జరగటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ శక్తులతో కుమ్మక్కయి దేశంలో శాంతికి విఘాతం కలిగిస్తున్న శక్తులను ఏరిపారేసేందుకు వీలుగా శనివారం సాయంత్రం నుండి దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి తేవాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు ఇథియో అధికార మీడియా ఆదివారం ఉదయం వెల్లడించింది.
నిరసనల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలలో జరిగిన ప్రాణ, ఆస్తినష్టంపై చర్చించిన మంత్రిమండలి ఎమర్జెన్సీ విధించాలని ప్రధాని హైలేమరియం దెసాలెన్కు సిఫార్సు చేసినట్లు మీడియా తన వార్తా కథనాలలో వివరించింది. ఆదివారం ఉదయం నుండి దేశంలోని అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగినట్లు స్థానికులు వెల్లడించారు. నిరసనకారులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం గత వారం రోజులుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







