డ్రగ్స్‌ కేసు: బహ్రెయినీ జంటకి రిమాండ్‌ పొడిగింపు

- October 09, 2016 , by Maagulf
డ్రగ్స్‌ కేసు: బహ్రెయినీ జంటకి రిమాండ్‌ పొడిగింపు

మనామా: డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బహ్రెయినీ జంటకు మరో 15 రోజులపాటు రిమాండ్‌ని పొడిగించారు. న్యాయస్థానం తెలిపిన వివరాల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జంట, బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టయ్యారు. 14,260 గ్రాముల షాబు, అలాగే 12 నార్కోటిక్‌ పిల్స్‌ని స్మగుల్‌ చేస్తూ వీరు దొరికారు. విశ్వసనీయ వర్గాల సమాచారం సేకరించి, పోలీసులు వారిని వ్యూహాత్మకంగా అరెస్టు చేయడం జరిగింది. పట్టుబడ్డవారిలో మహిళ, పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం మలేసియాలో బహ్రెయినీ వ్యక్తి ఒకరు ఆ డ్రగ్స్‌ని స్మగుల్‌ చేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. ఇంకో వైపున, సదరు మహిళకు ఆమె భార్య డ్రగ్స్‌ని స్మగ్లింగ్‌ చేసే అలవాటు ఉందన్న విషయం తెలియదని మహిళ తరఫు లాయర్‌ న్యాయస్థానానికి చెప్పారు. ఆమెకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసినా, బెయిల్‌ పిటిషన్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com