డ్రగ్స్ కేసు: బహ్రెయినీ జంటకి రిమాండ్ పొడిగింపు
- October 09, 2016మనామా: డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బహ్రెయినీ జంటకు మరో 15 రోజులపాటు రిమాండ్ని పొడిగించారు. న్యాయస్థానం తెలిపిన వివరాల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జంట, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అరెస్టయ్యారు. 14,260 గ్రాముల షాబు, అలాగే 12 నార్కోటిక్ పిల్స్ని స్మగుల్ చేస్తూ వీరు దొరికారు. విశ్వసనీయ వర్గాల సమాచారం సేకరించి, పోలీసులు వారిని వ్యూహాత్మకంగా అరెస్టు చేయడం జరిగింది. పట్టుబడ్డవారిలో మహిళ, పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం మలేసియాలో బహ్రెయినీ వ్యక్తి ఒకరు ఆ డ్రగ్స్ని స్మగుల్ చేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. ఇంకో వైపున, సదరు మహిళకు ఆమె భార్య డ్రగ్స్ని స్మగ్లింగ్ చేసే అలవాటు ఉందన్న విషయం తెలియదని మహిళ తరఫు లాయర్ న్యాయస్థానానికి చెప్పారు. ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసినా, బెయిల్ పిటిషన్ని న్యాయస్థానం తిరస్కరించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ