మొరాయించిన ఈ-మైగ్రేట్ విధానం - ఉపాధి కోల్పోయిన 10,000 మంది భారతీయులు

- August 17, 2015 , by Maagulf
మొరాయించిన ఈ-మైగ్రేట్ విధానం - ఉపాధి కోల్పోయిన 10,000 మంది భారతీయులు

భారత్‌లోని 10,000కు పైగా శ్రామికులు కొత్త ఆన్ లైన్ రిక్రూట్‌మెంట్ విధానం వలన తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాఫ్ట్ వేర్ సమస్యలకు తోడుగా ఈ-మైగ్రేట్ విధానాన్ని అమలుజరపడంలో వ్యత్యాసాలు అగ్నికి ఆజ్యంలా తోదయ్యాయని భావిస్తున్నారు. 5 సంవత్సరాల కాలవ్యవధిగల ఉద్యోగ ఒప్పందానికిగాను విదేశీ యజమానులు ఆన్ లైన్ ఆటో రిజిస్ట్రెషన్ ను తప్పనిసరి చేయడం వలన, వారు ఆ వ్యవధి ఒక సంవత్సరానికి తగ్గించేశారని, అందువల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ పెర్సనల్ ఛైర్మన్ శ్రీ దీపక్ చాబ్రియా తెలియజేశారు. యూ. ఏ. ఈ. మరియు ఇతర జి. సి. సి. దేశాల్లోని నిర్మాణ మరియు ఇతర కార్మికుల ఉద్యోగాలను ఊడగొట్టిన ఈ విధాన్ని రద్దు చేయాలని అనేక భారతీయ సంస్థలు భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com