అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తున్న11 మంది అరెస్టు
- October 14, 2016
అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తున్న11 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఎనిమిదిమంది భారతీయులు ఉన్నారు. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో వీరు పట్టుబడినట్లు ఓ ప్రకటన పేర్కొంది. వీరంతా ప్యూర్టోరికోలో ప్రవేశిస్తుండగా అరెస్టు చేసినట్లు తెలిపింది. అగదిలలోని రమీ సెక్టర్ ప్రధాన గస్తీ అధికారి రమిరో కరిలో మాట్లాడుతూ భారతదేశం నుంచి అమెరికా చేరుకునేలోగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మోనా పాసేజ్ను దాటడం చాలా కష్టమని తెలిపారు. వలసదారులకు ఇది భయానకంగా ఉంటుందన్నారు. సరైన డాక్యుమెంట్లు లేనివారిని రమీ బోర్డర్ పెట్రోల్ స్టేషన్కు పంపిస్తారని, అక్కడ తదుపరి దర్యాప్తు జరుగుతుందని వివరించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







