సింగపూర్ లోకల్ ట్రైన్లలో దీపావళి థీమ్...
- October 16, 2016
సింగపూర్ లాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సింగపూర్ లోకల్ ట్రైన్లలో దీపావళి థీమ్ను ప్రవేశ పెట్టారు. ట్రైన్ లోపలి భాగాల్లో హ్యాపీ దీపావళి అంటూ డెకరేషన్ చేశారు. రైల్వే స్టేషన్లలోనూ దీపావళి పండగను సూచించేలా కటౌట్లు, బ్యానర్లు, డిస్ప్లేలో ఉంచారు. హిందువులకు ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి. అందుకే ఈ పండగకు ప్రాధాన్యం ఇస్తోంది సింగపూర్. గత కొన్నేళ్లుగా ముఖ్యమైన పండగలకు ఇలాంటి థీమ్స్ను సింగపూర్ లాండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అందుబాటులోకి తీసుకొస్తోంది. దీపావళి థీమ్ ముగిసిన తర్వాత క్రిస్మస్ పండగను పురస్కరించుకుని మరో థీమ్ను రైళ్లలో ప్రవేశ పెట్టనుంది. సింగపూర్ జనాభాలో 10 శాతం భారతీయులున్నారు. అక్కడ దీపావళి పండగను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. అందుకే ఈ పండగ సందర్భంగా సింగపూర్ సరికొత్త థీమ్ను రైళ్లలో ప్రదర్శిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







