మానవసహిత రోదసి యాత్ర : చైనా
- October 17, 2016
చైనా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ మానవసహిత అంతరిక్ష యాత్ర సోమవారం విజయవంతంగా ప్రారంభమైంది. చైనా కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 7.30 గంటలకు ఇద్దరు వ్యోమగాములతో షెంజౌ-11 అనే వ్యోమనౌన రోదసిలోకి దూసుకెళ్లింది. జియుక్వాన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించారు.
ఈ నౌకలో జింగ్ హైపెంగ్.. షెన్ డాంగ్ అనే ఇద్దరు వ్యోమగాములు కక్ష్యలోకి పయనమయ్యారు. లాంగ్ మార్చ్ 2ఎఫ్ అనే రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌక నిర్ణీత క్షక్ష్యలోకి ప్రవేశించింది. రెండు రోజుల్లో వీరు రోదసిలోని చైనా ప్రయోగాత్మక అంతరిక్ష కేంద్రానికి చేరుకుని..నెల రోజులు అక్కడే బస చేస్తారు. వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి చేర్చిన తర్వాతి రోజు షెంజౌ-11 వ్యోమనౌక భూమికి తిరుగు ప్రయాణం కానుంది. ప్రయోగానికి ముందు వ్యోమగాములు మీడియాతో మాట్లాడారు. ఈ మిషన్కు జింగ్ హైపెంగ్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు.అంతరిక్షంలోకి వెళ్లడం జింగ్కు ఇది మూడోసారి. 2008లో షెంజౌ-7 మిషన్, 2012లో షెంజౌ-9 మిషన్లో జింగ్ రోదసిలో వెళ్లివచ్చారు. 2003లో చైనా తొలిసారిగా మానవసహిత అంతరిక్ష ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2022 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ఇప్పుడీ సుదీర్ఘ మానవసహిత రోదసి యాత్రను చేపట్టింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







