పెరుగు చేప
- October 18, 2016
కావలసిన పదార్థాలు: ముల్లులేని చేపముక్కలు (నలుపలకలుగా ఉన్నవి) - 800 గ్రా., నూనె - 80 గ్రా., యాలకులు - 4, పచ్చిమిర్చి పేస్టు - 2 టీ స్పూన్లు, అల్లం పేస్టు - 40 గ్రా., ఉల్లిపాయ పేస్టు - 250 గ్రా., గిలక్కొట్టిన పెరుగు - 250 గ్రా., పసుపు - 1 టీ స్పూను, మసాలా పొడి - అర టీ స్పూను, ఉప్పు- రుచికి తగినంత, నీరు - 150 మిల్లీ లీటర్లు.
తయారుచేసే విధానం: లోతులేని కడాయిలో నూనె వేడిచేసి చేప ముక్కల్ని రెండు వైపులా వేగించి పక్కకి తీసి పెట్టుకోవాలి. వేరే కడాయిలో నూనె వేసి యాలకుల్ని , అల్లం పేస్టుని వేసి వేగించుకోవాలి. ఉల్లిముద్ద, పచ్చిమిర్చి, పసుపు, పెరుగుని వేసి సన్నని సెగమీద చిక్కబడేదాకా ఉడికించాలి. తర్వాత నీరుని జతచేయాలి. అది మరుగుతుండగా వేగించి పక్కనుంచుకున్న చేపముక్కల్ని వేసి ఉడికించి, మసాలాపొడి వేసి దించేసి వేడిగా అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







