కేబినెట్ నిర్ణయం.. ముసాయిదా తయారీకి ఆదేశం..
- October 18, 2016
ఆంధ్రప్రదేశ్కి కొత్త రెంట్ కంట్రోల్ చట్టాన్ని రూపొందించనున్నారు. ఈమేరకు మంగళవారం నాటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో 2011లో ఏపీ రెంట్ కంట్రోల్ చట్టాన్ని రూపొందించారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అద్దెలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ అవసరాలకు తీసుకొనే భవనాలకు ప్రభుత్వం చదరపు అడుగుకు గరిష్ఠంగా రూ.30 అద్దె నిర్ణయించింది. కానీ, తరలింపులో భాగంగా సాధారణ ఉద్యోగులు, సామాన్య ప్రజలు అనేక మంది ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు.ఇదే అవకాశంగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని పల్లెల్లో సైతం అద్దెలు రూ.10వేలు దాటాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నేటి కాలానికి అనుగుణంగా కొత్త చట్టం రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 2011 నాటి ఏపీ రెంట్ కంట్రోల్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దాని స్థానంలో ఏపీ రెంట్ కంట్రోల్ చట్టం-2016ను రూపొందించనున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









