ఖతార్ లో అమలులోకి వచ్చిన ఈ-వేతనాలు

- August 19, 2015 , by Maagulf
ఖతార్ లో అమలులోకి వచ్చిన ఈ-వేతనాలు

వలస కార్మీకుల వేతనాలకు హామీ కల్పించే లక్ష్యంతో రూపొందించిన ప్రముఖ శ్రామిక సంస్కరణాలలో ఒకటైన 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' కతార్ లో నేటినుండి అధికారికంగా అమలులోని రానుంది. నేటితో ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాన్ని అమలుపర్చడానికి, యజమానులకు ఇచ్చిన గ్రేస్ పెరియడ్ పూర్తయ్యింది. నిబంధనలు అతిక్రమించిన సంస్థలకు 600 కతార్ రియాల్ జరిమాన, కొత్త సిబ్బంది  నియామకంపై నిషేధంతో బాటు, యజమానులు కారాగారానికి కూడా వెళ్ళవలశిరావచ్చు.  ప్రవాసీయులు వేతనాల విషయంలో అనేక ఇబ్బందులకు మోసాలకు గురౌతున్న నేపధ్యంలో, 2022 ప్రపంచకప్ మొదలైన ప్రాజెక్టులలో పనిచేయడానికి వచ్చే వలస శ్రామికులకు సమయానికి వేతనం అందె వీలు కలుగుతుంది. ఈ ఆగస్టు 18 అనేది గడువు కాదని, కతార్ కు ఒక కొత్త ఆరంభమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిసర్చ్ స్కాలర్ ముస్తఫా ఖాద్రీ అభిప్రాయపడ్డారు.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com