కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత పర్యటన

- August 19, 2015 , by Maagulf
కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత పర్యటన

కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత పర్యటిస్తున్నారు. నియోజక వర్గ పర్యటనలో భాగంగా పెంబట్లలో దుబ్బ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం "మన ఊరు - మన ఎంపీ" కార్యక్రమంలో భాగంగా సారంగపూర్ మండలం రేచపల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మీడియాతో మాట్లాడిన కవిత.. ప్రజా సమస్యల్ని ఎప్పటి్కప్పుడు పార్లమెంట్లో లేవనెత్తుతున్నామన్నారు. ఏడాదిలోనే 140కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చామన్నారు. గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన ఉపాధిని చూపుతామని తెలిపారు. అరచేతిలో వైకుంఠం చూపే గల్ఫ్ ఏజెంట్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ జిల్లా వాసులకు సూచించారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి గుడ్డిగా గల్ఫ్ విమానాలు ఎక్కొద్దని.. అలాగే ఏజెంట్ల మాయలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిర్ణీత జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com