కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత పర్యటన
- August 19, 2015
కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత పర్యటిస్తున్నారు. నియోజక వర్గ పర్యటనలో భాగంగా పెంబట్లలో దుబ్బ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం "మన ఊరు - మన ఎంపీ" కార్యక్రమంలో భాగంగా సారంగపూర్ మండలం రేచపల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మీడియాతో మాట్లాడిన కవిత.. ప్రజా సమస్యల్ని ఎప్పటి్కప్పుడు పార్లమెంట్లో లేవనెత్తుతున్నామన్నారు. ఏడాదిలోనే 140కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చామన్నారు. గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన ఉపాధిని చూపుతామని తెలిపారు. అరచేతిలో వైకుంఠం చూపే గల్ఫ్ ఏజెంట్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ జిల్లా వాసులకు సూచించారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి గుడ్డిగా గల్ఫ్ విమానాలు ఎక్కొద్దని.. అలాగే ఏజెంట్ల మాయలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిర్ణీత జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







