డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ మాడ్యులర్ పాడ్స్పై ప్రత్యేక శ్రద్ధ
- October 19, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, అలాగే కరీమ్ సంయుక్తంగా డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం వినియోగించేందుకోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ మాడ్యులర్ పాడ్స్ - ఎలక్ట్రిక్ పవర్డ్ వాహనాలు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయని ఈ సందర్భంగా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. దుబాయ్ అటానమస్ ట్రాన్స్పోర్టేషన్ స్ట్రాటజీలో భాగంగా ఈ ప్రోగ్రామ్ని వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ది యూఏఈ మరియు రూలర్ ఆఫ్ దుబాయ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచన మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2030 నాటికి ట్రాన్స్పోర్టేషన్లో 25 శాతం డ్రైవర్లెస్ వాహనాలతో ఉండాలని అంచనాకి వచ్చారు. ఈ డ్రైవర్లెస్ పాడ్స్ని ఉపయోగించుకునేందుకు వీలుగా కరీమ్ యాప్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో డ్రైవర్లెస్ పాడ్స్ని రానున్న 12 నెలల్లోనే టెస్ట్ రన్ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో కరీమ్ పర్ఫెక్ట్ పార్టనర్ అని ఆర్టిఎ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







