డ్రైవర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ మాడ్యులర్‌ పాడ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ

- October 19, 2016 , by Maagulf
డ్రైవర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ మాడ్యులర్‌ పాడ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, అలాగే కరీమ్‌ సంయుక్తంగా డ్రైవర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ మెథడ్‌ని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కోసం వినియోగించేందుకోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. డ్రైవర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ మాడ్యులర్‌ పాడ్స్‌ - ఎలక్ట్రిక్‌ పవర్డ్‌ వాహనాలు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయని ఈ సందర్భంగా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. దుబాయ్‌ అటానమస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ స్ట్రాటజీలో భాగంగా ఈ ప్రోగ్రామ్‌ని వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ది యూఏఈ మరియు రూలర్‌ ఆఫ్‌ దుబాయ్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ సూచన మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2030 నాటికి ట్రాన్స్‌పోర్టేషన్‌లో 25 శాతం డ్రైవర్‌లెస్‌ వాహనాలతో ఉండాలని అంచనాకి వచ్చారు. ఈ డ్రైవర్‌లెస్‌ పాడ్స్‌ని ఉపయోగించుకునేందుకు వీలుగా కరీమ్‌ యాప్‌ని కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో డ్రైవర్‌లెస్‌ పాడ్స్‌ని రానున్న 12 నెలల్లోనే టెస్ట్‌ రన్‌ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో కరీమ్‌ పర్‌ఫెక్ట్‌ పార్టనర్‌ అని ఆర్‌టిఎ వర్గాలు పేర్కొన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com