రాజుగారి చేపల కథ

- August 19, 2015 , by Maagulf
రాజుగారి చేపల కథ

అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు తన రాజ్యానికి తూర్పు వైపు ఉన్న ఒక కొలను దగ్గరకు వెళ్లి విశ్రాంతి సమయాన్ని ప్రశాంతంగా గడిపేవారు. ఆ కొలనులోని కలువలు రాజును పలకరిస్తున్నట్టుగా ఆయనను చూసి నవ్వుతున్నట్లుగా రాజు భావించేవాడు. అయితే ఆ కొలనుకు మరింత అందం తీసుకు రావాలని రాజుగారు ఆ కొలనులో అందమైన చేపలను పెంచాలని భావించి భటులకు ఆదేశించాడు. భటులు రంగు రంగుల చేపలను తీసుకుని వచ్చి రాణిగారి చేతికి ఇచ్చారు. రాణి ఆ చేపలను చూసి రకరకాల కూరలు వండమని వంటగత్తెలకు సూచించింది. రాజు ఆ రోజు వంటలను ఆస్వాదిస్తూ పుష్టిగా భోజనం చేశాడు. ఆ తరువాత భటులకు ఆదేశించిన చేపల సంగతి గుర్తుకు వచ్చి వారిని పిలిచి అడుగగా రాణిగారికిచ్చిన సంగతి తెలియజేశారు భటులు. రాణిని పిలిచి అడుగగా వంట సంగతిని చెప్పింది. అంతే కాకుండా మీరు నాకు ఆ సంగతిని చెప్పనే లేదు నాకు కూడా కొలనులో వేసే చేపల విషయాన్ని ప్రస్తావించి ఉండుంటే బాగుండేది అని ఆమె విస్తుపోయింది. దాంతో ఆయనే అసలు విషయాన్ని ప్రస్తావించకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందనీ తరువాత భటులకు విషయాన్ని విపులంగా చెప్పి, మరిన్ని రంగురంగుల అందమైన చేపలను తెప్పించి కొలనులో వేయించాడు. అప్పట్నుంచీ ఆ కొలనులోని చేపలను చూస్తూ, రాజు, రాణులు ఇద్దరూ తమ విశ్రాంతి సమయాన్ని ఆనందంగా గడిపేవారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com