మక్కా కేసులో రణధీర్ కుమార్సింగ్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం
- October 21, 2016మక్కా మసీదు బాంబు పేలుడు కేసులో జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి రణధీర్ కుమార్సింగ్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మక్కా పేలుడు కేసు తుది విచారణలో భాగంగా సింగ్ కోర్టుకు ఇటీవల హాజరయ్యారు. సున్నితమైన అంశంకావడంతో భద్రతాకారణాల వల్ల మంత్రి వెల్లడించిన అంశాల్ని బహిర్గతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం మరోసారి కోర్టుకు హాజరై రణధీర్కుమార్ సింగ్ మరిన్ని వివరాల్ని వెల్లడించనున్నారు. 2007 మే 18న మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడులో 9 మంది మరణించగా.. 50 మంది గాయపడ్డారు. ఈ కేసులో సునీల్జోషి, దేవేంద్రగుప్తాతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు...దర్యాప్తులో భాగంగా దేవేంద్రగుప్తా, మంత్రి రణధీర్ కుమార్సింగ్కు ఉన్న పరిచయం దృష్ట్యా గతంలో స్టేట్మెంట్ రికార్డు చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా