మక్కా కేసులో రణధీర్ కుమార్సింగ్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం
- October 21, 2016
మక్కా మసీదు బాంబు పేలుడు కేసులో జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి రణధీర్ కుమార్సింగ్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మక్కా పేలుడు కేసు తుది విచారణలో భాగంగా సింగ్ కోర్టుకు ఇటీవల హాజరయ్యారు. సున్నితమైన అంశంకావడంతో భద్రతాకారణాల వల్ల మంత్రి వెల్లడించిన అంశాల్ని బహిర్గతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం మరోసారి కోర్టుకు హాజరై రణధీర్కుమార్ సింగ్ మరిన్ని వివరాల్ని వెల్లడించనున్నారు. 2007 మే 18న మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడులో 9 మంది మరణించగా.. 50 మంది గాయపడ్డారు. ఈ కేసులో సునీల్జోషి, దేవేంద్రగుప్తాతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు...దర్యాప్తులో భాగంగా దేవేంద్రగుప్తా, మంత్రి రణధీర్ కుమార్సింగ్కు ఉన్న పరిచయం దృష్ట్యా గతంలో స్టేట్మెంట్ రికార్డు చేశారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









