కేసినో రాకెట్ను పోలీసులు బయటపెట్టారు
- October 24, 2016
దేశ రాజధాని దిల్లీలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక కేసినో రాకెట్ను పోలీసులు బయటపెట్టారు. దీనికి సంబంధించి 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం దక్షిణ దిల్లీలోని నెబ్సరయ్లో దాడులు చేసి వీరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఆటగాళ్లు, టేబుల్ అటెండెంట్స్, ప్రొప్రైటర్లు ఉన్నట్లు వారు వెల్లడించారు. నిందితుల వద్ద గల రూ.1.37కోట్ల విలువైన టోకెన్లతో పాటుగా, 11 లగ్జరీ కార్లు, అధిక మొత్తంలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిపై గాంబ్లింగ్, ఎక్సైజ్ల చట్టం కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం కేసినోను సీజ్ చేసి, పరారీలో ఉన్న కేసినో యజమాని, భవన యజమానులకై గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







