'ఆవు పులి మధ్యలో ప్రభాస్‌ పెళ్ళి' నవంబర్‌ 4న విడుదల...

- October 24, 2016 , by Maagulf
'ఆవు పులి మధ్యలో ప్రభాస్‌ పెళ్ళి'  నవంబర్‌ 4న  విడుదల...

అందమైన ప్రేమకథతో 'ఆవు పులి మధ్యలో ప్రభాస్‌ పెళ్ళి' చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు ఎస్‌.జె.చైతన్య తెలిపారు. ఎ.రవితేజ, అశ్విని చంద్రశేఖర్‌ జంటగా రెడ్‌కార్పెట్‌ రీల్స్‌ పతాకంపై శైలజ సమర్పణలో రవి పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆదివారంనాడు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ, 'ప్రభాస్‌కు మా యూనిట్‌ తరపున జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. ఈ టైటిల్‌ ఎంతమాత్రం వివాదాస్పదం కాదు. తెలుగులో మొదటిసారిగా ఏడవటానికి వాడే గ్లిజరిన్‌ని నవ్వించటానికి ఉపయోగించాం. అలాగే నెల్లూరులోని రియల్‌ గ్యాంగ్‌స్టర్స్‌ను ఈ చిత్రంలో నటింపజేశాం.ఓ యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. చిన్న సినిమాలను తీయడం కంటే విడుదలచేయడం కష్టమైన ఈ పరిస్థితులలో పక్కా ప్రణాళికతో మేం ముందుకెళ్తున్నాం' అని అన్నారు. నిర్మాత రవి మాట్లాడుతూ, అందరినీ అలరింపజేసేవిధంగా వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని, నవంబర్‌ 4న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. హీరో ఎ.రవితేజ మాట్లాడుతూ, 'డార్క్‌ కామెడీతో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ అంతా నెల్లూరులో జరిగింది.పాత్రల మధ్య సీరియస్‌నెస్‌ ఉన్నా చూసే ప్రేక్షకులు హాస్యంతో ఆనందిస్తారు' అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అశ్విని చంద్రశేఖర్‌, భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కవిశంకర్‌, కెమెరా: ఆర్తి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com