కేసినో రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు

- October 24, 2016 , by Maagulf
కేసినో రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు

దేశ రాజధాని దిల్లీలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక కేసినో రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు. దీనికి సంబంధించి 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం దక్షిణ దిల్లీలోని నెబ్‌సరయ్‌లో దాడులు చేసి వీరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఆటగాళ్లు, టేబుల్‌ అటెండెంట్స్‌, ప్రొప్రైటర్లు ఉన్నట్లు వారు వెల్లడించారు. నిందితుల వద్ద గల రూ.1.37కోట్ల విలువైన టోకెన్లతో పాటుగా, 11 లగ్జరీ కార్లు, అధిక మొత్తంలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిపై గాంబ్లింగ్‌, ఎక్సైజ్‌ల చట్టం కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం కేసినోను సీజ్‌ చేసి, పరారీలో ఉన్న కేసినో యజమాని, భవన యజమానులకై గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com