కార్పొరల్ పనిష్మెంట్పై ఒమన్ బ్యాన్
- October 24, 2016
మస్కట్: ఒమన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, కార్పొరల్ పనిష్మెంట్ని మస్కట్ స్కూల్స్లో బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్కూళ్ళలో విద్యార్థులను టీచర్లు దండించడంపై పేరెంట్స్ నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు మినిస్ట్రీ ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిబంధనల్ని ఉల్లంఘించే టీచర్లకు 5,000 రియాల్స్ ఫైన్ విధించబడుతుంది. అలాగే ఐదేళ్ళ జైలు శిక్ష కూడా వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం పట్ల ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ అహ్మద్ అల్ మర్రి వ్యతిరేకత వ్యక్తం చేశారు. 25 మంది స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి పనిష్మెంట్ తప్పదని అహ్మద్ అల్ మర్రి చెప్పారు. ఇంకో టీచర్ మొహమ్మద్ అల్ నస్రి, కార్పొరల్ పనిష్మెంట్ బ్యాన్ని సమర్థించారు. సలీమ్ అల్ సర్మి, ఇంకొందరు పేరెంట్స్తో కలిసి మినిస్ట్రీలో పిర్యాదు చేశారు. 12 ఏళ్ళ విద్యార్థి, టీచర్ హెరాష్మెంట్తో తీవ్రంగా గాయపడినట్లు సలీమ్ పేర్కొన్నారు. ఉస్టా గవర్నరేట్ పరిధిలోని ఓ స్కూల్లో టీచర్ ఒకరు, విద్యార్థిని దారుణంగా కొట్టడాన్ని ఇంకో విద్యార్థి ఫోన్లో రికార్డ్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే ఆ టీచర్ని తొలగించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







