గాలి జనార్దన రెడ్డి తన కుమార్తె బ్రహ్మణి పెళ్ళికి రావలసిందిగా ఆహ్వానo...
- October 26, 2016
కర్ణాటక మాజీ మంత్రి. మైనింగ్ ఘనుడు గాలి జనార్దన రెడ్డి తన కుమార్తె బ్రహ్మణి పెళ్ళికి రావలసిందిగా ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసిఆర్ లను స్వయంగా ఆహ్వానించనున్నారు. నవంబరు 16 న బళ్లారిలో ఈ పెళ్లి ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులకు, సెలబ్రిటీ లకు శుభలేఖలు పంపారు. ఇటీవలే గాలి.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఇక టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలనుంచి పెద్ద సంఖ్యలో దిగ్గజాలంతా తరలి రానున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ వంటి వారు తమ డ్యాన్సులతో అదిరే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని తెలిసింది
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







