సిరియాలోని ఓ పాఠశాలపై వైమానిక దాడి...
- October 27, 2016
సిరియాలోని ఓ పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 22 మంది చిన్నారులు, ఆరుగురు ఉపాధ్యాయులు మరణించినట్లు ఐరాస పిల్లల విభాగం యునిసెఫ్ వెల్లడించింది. ఇది అత్యంత విషాదమని, యుద్ధనేరమని యునిసెఫ్ డైరెక్టర్ ఆంటోనీ లేక్ ఆవేదన వ్యక్తం చేశారు. సిరియాలోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఇడిలిబ్ ప్రావిన్స్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాలలపై జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదేనని లేక్ పేర్కొన్నారు.రష్యా, సిరియా యుద్ధ విమానాలు ఇడిలిబ్ ప్రావిన్స్లోని హాస్ గ్రామంలో దాదాపు ఆరుసార్లు వైమానిక దాడులకు పాల్పడ్డారని, పాఠశాల కాంప్లెక్స్పైనా దాడులు చేయడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని సిరియాకు చెందిన ఓ మానవ హక్కుల పరిశీలన సంస్థ కూడా వెల్లడించింది.దాడులకు సంబంధించి పాఠశాలలోని హృదయవిదారక దృశ్యాలు సోషల్మీడియాలు కనిపిస్తున్నాయి.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలు, తిరుగుబాటుదారుల దాడులు, అంతర్యుద్ధంతో సిరియా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులను అణచడానికి సిరియా ప్రభుత్వం ఇతర దేశాల సహాయంతో వైమానిక దాడులు చేస్తోంది. అయితే ఈ దాడుల్లో సాధారణ ప్రజలు కూడా సమిధలవుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు







