ప్రవాసీయుల బోనస్ అలవెన్సులలో కోత విధించండి
- October 27, 2016
మనామా : ప్రవాసీయులకు ఇచ్చే బోనస్, అలవెన్సులులో 50 శాతం వరకు తగ్గించమని బహ్రేయినీ చట్ట నిర్మాతలు సూచిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ప్రవాసీయులకు ఇచ్చే బోనస్ మరియు ఇతర అలవెన్సులలో కోత విధించాలని ద్రవ్య మరియు ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యుడు జలాల్ కాదేం అల్ మఃఫోఉద్ పిలుపు ఇచ్చారు. ప్రవాసీయులకు ఇచ్చే అలవెన్సులలో 50 శాతం మేరకు తగ్గించడం ద్వారా ఈ ప్రయోజనం మెరుగు పడుతుందని బహ్రేయినీ రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థపై అనుకూలమైన స్థితి ప్రతిబింబిస్తాయి మరియు ఆదాయాల సరైన మళ్లింపునకు దారి తీస్తుందని అని ఎంపీ అన్నారు. కువైట్ సైతం ఇదే విధానం పాటిస్తున్నట్లు అల్ మఃఫోఉద్ గుర్తు చేశారు.కువైట్ ఇటీవల ప్రవాసీయుల అలవెన్సులు బోనస్ విషయంలో కోత విధించింది. ఈ చర్య ద్వారా కువైట్ జాతీయ ఆర్థిక ప్రయోజనం ఎంతో మెరుగుపడినట్లు నిరూపించబడిందని ఆయన ఉదహరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రయోగం బహరేన్ కూడా అమలు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









