బ్రిటన్ ప్రధాని భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు...
- October 27, 2016
బ్రిటన్లో ఉంటున్న భారతీయులకు ఆ దేశ ప్రధానమంత్రి థెరిస్సా మే.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. హౌస్ ఆఫ్ పార్లమెంట్లో హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్(హెచ్ఎఫ్బీ) నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పంపిన సందేశాన్ని పార్లమెంట్ అధికారి బాంబ్ బ్లాక్మెన్ చదివి వినిపించారు. 'బ్రిటన్లోని భారతీయులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి కష్టపడి వాటిని వృద్ధిలోకి తీసుకొస్తారు. అంతేగాకుండా తమ కుటుంబాలకు తగిన ప్రాధాన్యత ఇస్తారు. వారిని చూసి గర్విస్తున్నా' అని ఆమె సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానున్నట్లు ఆమె తెలిపారు'.ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు.థేమ్స్ నదీ తీరాన ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్లోని టెర్రస్ పెవిలియన్లో ఈ వేడుకలు జరిగాయి. మంత్రోచ్ఛరణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో పార్లమెంటు సభ్యులు, అక్కడ నివసిస్తున్న పలువురు భారతీయులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







