బ్రిటన్ ప్రధాని భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు...
- October 27, 2016
బ్రిటన్లో ఉంటున్న భారతీయులకు ఆ దేశ ప్రధానమంత్రి థెరిస్సా మే.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. హౌస్ ఆఫ్ పార్లమెంట్లో హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్(హెచ్ఎఫ్బీ) నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పంపిన సందేశాన్ని పార్లమెంట్ అధికారి బాంబ్ బ్లాక్మెన్ చదివి వినిపించారు. 'బ్రిటన్లోని భారతీయులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి కష్టపడి వాటిని వృద్ధిలోకి తీసుకొస్తారు. అంతేగాకుండా తమ కుటుంబాలకు తగిన ప్రాధాన్యత ఇస్తారు. వారిని చూసి గర్విస్తున్నా' అని ఆమె సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానున్నట్లు ఆమె తెలిపారు'.ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు.థేమ్స్ నదీ తీరాన ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్లోని టెర్రస్ పెవిలియన్లో ఈ వేడుకలు జరిగాయి. మంత్రోచ్ఛరణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో పార్లమెంటు సభ్యులు, అక్కడ నివసిస్తున్న పలువురు భారతీయులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







