బ్రిటన్‌ ప్రధాని భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు...

- October 27, 2016 , by Maagulf
బ్రిటన్‌ ప్రధాని భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు...

బ్రిటన్‌లో ఉంటున్న భారతీయులకు ఆ దేశ ప్రధానమంత్రి థెరిస్సా మే.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌లో హిందూ ఫోరమ్‌ ఆఫ్‌ బ్రిటన్‌(హెచ్‌ఎఫ్‌బీ) నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పంపిన సందేశాన్ని పార్లమెంట్‌ అధికారి బాంబ్‌ బ్లాక్‌మెన్‌ చదివి వినిపించారు. 'బ్రిటన్‌లోని భారతీయులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి కష్టపడి వాటిని వృద్ధిలోకి తీసుకొస్తారు. అంతేగాకుండా తమ కుటుంబాలకు తగిన ప్రాధాన్యత ఇస్తారు. వారిని చూసి గర్విస్తున్నా' అని ఆమె సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే నెలలో భారత్‌ పర్యటనకు రానున్నట్లు ఆమె తెలిపారు'.ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్నారు.థేమ్స్‌ నదీ తీరాన ఉన్న హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని టెర్రస్‌ పెవిలియన్‌లో ఈ వేడుకలు జరిగాయి. మంత్రోచ్ఛరణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో పార్లమెంటు సభ్యులు, అక్కడ నివసిస్తున్న పలువురు భారతీయులు పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com