బియ్యం నీళ్లతో చుండ్రు నుంచి ఉపశమనం
- August 23, 2015
బియ్యం కడిగిన నీళ్లతో అందాన్ని మరింత అందం చేసుకోవచ్చు. చిక్కగా ఉన్న బియ్యం నీళ్లలో దూదిని ఉండలుగా చేసి వేయాలి. ఆ దూది ఉండలతో ముఖం తుడుచుకుంటే కాలుష్యంతో ముఖానికి పట్టిన మురికి, మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా మెరుస్తుంది. చర్మం మీద అప్పుడప్పుడూ కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు బాధపెడుతూ ఉంటాయి. వాటిని ఈ బియ్యం నీళ్లతో తొలగించుకోవచ్చు. అన్నం వార్చిన నీళ్లలో(గంజి), బియ్యం కడిగిన నీళ్లు కొన్ని కలిపి, దానికి కొద్దిగా పసుపు చేర్చి పేస్ట్లా చేసి ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచి ఆ మిశ్రమాన్ని మరుసటిరోజు ఉదయం తలకు పట్టించి, ఇరవై నిముషాల తరువాత తలస్నానం చేస్తే తలలోని చుండ్రు, తద్వారా వచ్చే దురద నుండి ఉపశమనం పొందవచ్చు. అనేక చర్మ సమస్యలకు ఈ బియ్యం గంజి నీళ్లు మంచి మందుగా పని చేస్తాయి.ఈ గంజి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మ సమస్యలనూ, దురదలనూ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే త్వరగా ఉపశమనం పొందవచ్చు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







