బియ్యం నీళ్లతో చుండ్రు నుంచి ఉపశమనం

- August 23, 2015 , by Maagulf
బియ్యం నీళ్లతో చుండ్రు నుంచి ఉపశమనం

బియ్యం కడిగిన నీళ్లతో అందాన్ని మరింత అందం చేసుకోవచ్చు. చిక్కగా ఉన్న బియ్యం నీళ్లలో దూదిని ఉండలుగా చేసి వేయాలి. ఆ దూది ఉండలతో ముఖం తుడుచుకుంటే కాలుష్యంతో ముఖానికి పట్టిన మురికి, మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా మెరుస్తుంది. చర్మం మీద అప్పుడప్పుడూ కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు బాధపెడుతూ ఉంటాయి. వాటిని ఈ బియ్యం నీళ్లతో తొలగించుకోవచ్చు. అన్నం వార్చిన నీళ్లలో(గంజి), బియ్యం కడిగిన నీళ్లు కొన్ని కలిపి, దానికి కొద్దిగా పసుపు చేర్చి పేస్ట్‌లా చేసి ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచి ఆ మిశ్రమాన్ని మరుసటిరోజు ఉదయం తలకు పట్టించి, ఇరవై నిముషాల తరువాత తలస్నానం చేస్తే తలలోని చుండ్రు, తద్వారా వచ్చే దురద నుండి ఉపశమనం పొందవచ్చు. అనేక చర్మ సమస్యలకు ఈ బియ్యం గంజి నీళ్లు మంచి మందుగా పని చేస్తాయి.ఈ గంజి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మ సమస్యలనూ, దురదలనూ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే త్వరగా ఉపశమనం పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com