బియ్యం నీళ్లతో చుండ్రు నుంచి ఉపశమనం
- August 23, 2015
బియ్యం కడిగిన నీళ్లతో అందాన్ని మరింత అందం చేసుకోవచ్చు. చిక్కగా ఉన్న బియ్యం నీళ్లలో దూదిని ఉండలుగా చేసి వేయాలి. ఆ దూది ఉండలతో ముఖం తుడుచుకుంటే కాలుష్యంతో ముఖానికి పట్టిన మురికి, మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా మెరుస్తుంది. చర్మం మీద అప్పుడప్పుడూ కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు బాధపెడుతూ ఉంటాయి. వాటిని ఈ బియ్యం నీళ్లతో తొలగించుకోవచ్చు. అన్నం వార్చిన నీళ్లలో(గంజి), బియ్యం కడిగిన నీళ్లు కొన్ని కలిపి, దానికి కొద్దిగా పసుపు చేర్చి పేస్ట్లా చేసి ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచి ఆ మిశ్రమాన్ని మరుసటిరోజు ఉదయం తలకు పట్టించి, ఇరవై నిముషాల తరువాత తలస్నానం చేస్తే తలలోని చుండ్రు, తద్వారా వచ్చే దురద నుండి ఉపశమనం పొందవచ్చు. అనేక చర్మ సమస్యలకు ఈ బియ్యం గంజి నీళ్లు మంచి మందుగా పని చేస్తాయి.ఈ గంజి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మ సమస్యలనూ, దురదలనూ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే త్వరగా ఉపశమనం పొందవచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









