బియ్యం నీళ్లతో చుండ్రు నుంచి ఉపశమనం
- August 23, 2015
బియ్యం కడిగిన నీళ్లతో అందాన్ని మరింత అందం చేసుకోవచ్చు. చిక్కగా ఉన్న బియ్యం నీళ్లలో దూదిని ఉండలుగా చేసి వేయాలి. ఆ దూది ఉండలతో ముఖం తుడుచుకుంటే కాలుష్యంతో ముఖానికి పట్టిన మురికి, మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా మెరుస్తుంది. చర్మం మీద అప్పుడప్పుడూ కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు బాధపెడుతూ ఉంటాయి. వాటిని ఈ బియ్యం నీళ్లతో తొలగించుకోవచ్చు. అన్నం వార్చిన నీళ్లలో(గంజి), బియ్యం కడిగిన నీళ్లు కొన్ని కలిపి, దానికి కొద్దిగా పసుపు చేర్చి పేస్ట్లా చేసి ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచి ఆ మిశ్రమాన్ని మరుసటిరోజు ఉదయం తలకు పట్టించి, ఇరవై నిముషాల తరువాత తలస్నానం చేస్తే తలలోని చుండ్రు, తద్వారా వచ్చే దురద నుండి ఉపశమనం పొందవచ్చు. అనేక చర్మ సమస్యలకు ఈ బియ్యం గంజి నీళ్లు మంచి మందుగా పని చేస్తాయి.ఈ గంజి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మ సమస్యలనూ, దురదలనూ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే త్వరగా ఉపశమనం పొందవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







