అబుదాబీ, ఇండియా మధ్య సర్వీసులను విస్తరించిన ఎతిహాద్
- October 28, 2016
ఎతిహాద్ ఎయిర్వేస్, అబుదాబీ మరియు ఇండియా మధ్య సర్వీసులను ఇంకా విస్తరించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించింది. వ్యూహాత్మక భాగస్వామి అయిన జెట్ ఎయిర్వేస్తో కొత్త రూట్స్ని ప్రారంభిస్తున్నారు. 2017 నుంచి ఎతిహాద్ మరియు జెట్ ఎయిర్లైన్స్ సర్వీసులు రెండు దేశాల మధ్య వారానికి అదనంగా 28 సర్వీసుల్ని పెంచుతున్నట్లు పేర్కొన్నారు ఆ సంస్థల ప్రతినిథులు. అబుదాబీకి 11 ఇండియన్ సిటీస్కి మధ్య 175 సర్వీసుల్ని (వారానికి) ప్రస్తుతం నిర్వహిస్తోంది. రెండు సంస్థలూ కలిసి 252 సర్వీసుల్ని నిర్వహిస్తున్నాయి. ఇకపై 18 నగరాలను కవర్ చేసేలా 280 విమానాల్ని నిర్వహఙంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అబుదాబీ అహ్మదాబాద్కి ప్రస్తుతం ఉన్న సర్వీసుల్ని డబుల్ చేస్తారు. ఫిబ్రవరి 1 నుంచి డైలీ సర్వీసులు ఉంటాయి. అదే రోజు తిరుచురాపల్లి నుంచి అబుదాబీకి డైలీ సర్వీస్ ప్రారంభమవుతుంది. కన్నూర్ నుంచి అబుదాబీకి కూడా డైలీ సర్వీసులు 2017 రెండో అర్థభాగంలో ప్రారంభమవుతాయి. జనవరి 15 నుంచి ఢిల్లీ - అబుదాబీ నుంచి రెండో డైలీ సర్వీస్ ప్రారంభిస్తారు. ఇరు దేశాల మధ్యా కనెక్టివిటీని పెంచే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఎతిహాద్ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







