కేరళ రాష్ట్రంలోని పాఠశాలల పిల్లలకు డ్రగ్ చాక్లెట్లను విక్రయిస్తున్న బాగోతం ...
- October 28, 2016
కేరళ రాష్ట్రంలోని పాఠశాలల పిల్లలకు డ్రగ్ చాక్లెట్లను విక్రయిస్తున్న బాగోతం ఎక్సైజ్ అధికారుల దాడుల్లో వెలుగుచూసింది. సైకోట్రోపిక్ ఔషధాలు,వివిధ మత్తు పదార్థాలు, డ్రగ్స్ కలిపిన మాత్రలు, చాక్లెట్ల రూపంలో పాఠశాల పిల్లలు లక్ష్యంగా విక్రయిస్తున్నారని తేలింది. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్, విక్రయాలపై అధికారులు నిఘా పెంచడంతో వాటిని చాక్లెట్లలో కలిపి పాఠశాలల్లో పిల్లలకు విక్రయిస్తున్నారని వెల్లడైంది.
దీంతో ఎక్సైజ్ అధికారులు డ్రగ్ చాక్లెట్ విక్రయాలపై దృష్టి సారించారు. పదిరోజుల క్రితం పాలక్కాడులో ఎక్సైజ్ పోలీసులు మారువేషాల్లో వచ్చి డ్రగ్స్ కలిపిన 24 మౌత్ స్ర్పేలను స్వాధీనం చేసుకున్నారు. 4-అంగుళాల సీసాల్లో స్ట్రాబెర్రీ, నారింజ, యాపిల్ రుచులు కలిగిన డ్రగ్స్ మౌత్ స్ప్రేలను స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ సులేష్ కుమార్ చెప్పారు. చైనా తయారు చేసిన ఈ డ్రగ్ ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్నారని తేలిందన్నారు.
కోజికోడ్ లో ఎక్సైజ్ అధికారులు ఓ ఆలయ సమీపంలో డ్రగ్ తో తయారు చేసిన 705 నిట్రజేపం మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ మాత్రలు పాఠశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది. మొత్తంమీద డ్రగ్ చాక్లెట్లు, మాత్రలకు పాఠశాల విద్యార్థులు అలవాటుపడుతున్నారని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







