రాజేశ్వరరావుకు జానకి పెద్ద అభిమాని...
- October 28, 2016
చిన్నతనంలో వేదికలపై సాలూరి రాజేశ్వరరావు పాటలు అనేకం పాడుతూ పెరిగానని ప్రముఖ గాయని జానకి తెలిపారు. శుక్రవారం తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో రసమయి సంస్థ ఆధ్వర్యంలో సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వరరావు 95వ జయంత్యుత్సవం సందర్భంగా ఆయన పేరిట నెలకొల్పిన స్మారక పురస్కారాన్ని ప్రముఖ సంగీత గేయకవి వి.బి.సాయికృష్ణ యాచేంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాన కి సాయికృష్ణ యాచేంద్రను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాజేశ్వరరావు సినిమా పాటలే కాకుండా ప్రైవేటు పాటలు రాసి ప్రేక్షకులకు చేరువయ్యారని అన్నారు. రాజేశ్వరరావుకు పెద్ద అభిమానినని తెలిపారు.పగలే వెన్నె లా.. అనే పాట తెలుగు ప్రేక్షకుల జీవితాల్లో మరిచిపోలేరని అలాంటి పాట తాను పాడడంతో అదృష్టమని అన్నారు. సభాధ్యక్షత వహించిన డాక్టర్ వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ అస్తవ్యస్త వ్యవస్థలో మనసు గాయమైనపుడు రాజేశ్వరరావు పాటలు వింటే హాయిగా ఉంటుందని అన్నారు. లలిత సంగీతానికి పరిమళం అద్ది సినిమాలకు అందించిన ఘనత ఆయనదని అన్నారు.కార్యక్రమం లో పి.విజయబాబు, సంగీత దర్శకుడు కోటి, సాలూరి వాసురావు, రోషన్ సాలూరి ఎం.కె.రాము, ఆశాలత తదితరులు పాల్గొని సాయికృష్ణయాచేంద్రను సత్కరించారు. అంతకుముందు రాజేశ్వరరావు స్వరపరిచన చిత్రాల్లోని పాటలను ఆలపించారు. పలు మధురమైన గీతాలతో ప్రేక్షకులను అలరించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







