అబుధాబి లో 'NRT' సభ్యత్యానికి అమోఘ స్పందన ...
- October 29, 2016
యు.ఏ.ఈ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన APNRT కో-ఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ మేరకు శుక్రవారం సభ్యులు అబుధాబి లో ఉన్న తెలుగు ప్రజలను కలిసి సభ్యత్వ నమోదు చేసారు.
డాక్టర్ ముక్కు తులసి కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు NRI తెలుగు ప్రజలు సౌకర్యార్థం నూతన పథకాన్ని మొదలు పెట్టడం హర్షించదగ్గ విషయం అని అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రజల సౌకర్యార్థం ఎన్నో విధాలుగా ఉపోయోగపడుతుందని అన్నారు.
అనురాధ ఒబ్బిలిశెట్టి APNRT యొక్క పథకాలను తెలుగు వారికి వివరించారు.అందరూ ఉపయోగించుకొవాలని కోరారు.తెలుగు వారు తమ సమస్యలను తెలియజేసారు.సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
శ్రీకాంత్ చిత్తర్వు మాట్లాడుతూ ప్రభుత్వం APNRT ద్వారా విదేశాలలో ఉన్న తెలుగు వారికోసం నిరంతరం APNRT పనిచేస్తుందన్నారు. విదేశాలలో ఉన్న తెలుగు వారికీ ఏదైనా సమస్యలు వారి సొంత ప్రాంతం లో ఉంటె APNRT ని సంప్రదిస్తే పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్య క్రమంలో అనేక మంది తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు , ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందిని APNRT కో-ఆర్డినేటర్స్ తెలియజేసారు.



తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







