అలనాటి తార లత మళ్లీ తెరపై

- October 30, 2016 , by Maagulf
అలనాటి తార లత మళ్లీ తెరపై

జీఆర్‌కు జోడీగా వెండితెరకు పరిచయమై, దక్షిణాది మొత్తాన్ని తన అందం, అభినయంతో అలరించిన అలనాటి తార లత మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు. యువతారలు ఆరి, ఆస్నాజవేరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'నాగేష్‌ తిరైయరంగం' చిత్రంలో ఆమె గిరిజన స్ర్తీగా వ్యత్యాసమైన పాత్రలో నటిస్తున్నారు. 'అగడం' ఫేమ్‌ మహ్మద్‌ ఇసాక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌నటి సితార ముఖ్య పాత్రలో నటిస్తోంది. వెండితెర పునరాగమనంపై లత స్పందిస్తూ... 'ఈ సినిమాలో గిరిజన స్ర్తీ పాత్ర నేనే పోషించాలని దర్శకుడు పట్టుబట్టారు. కథ కూడా నచ్చడంతో అంగీకరించాను. నా పునరాగమనానికి మంచి పాత్ర లభించిందని నమ్ముతున్నాను' అని పేర్కొన్నారు.గిరిజన ప్రజల సంక్షేమ కోసం, వారికి విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం కోసం పోరాడే గిరిజన స్ర్తీ పాత్రలో లత నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com