అలనాటి తార లత మళ్లీ తెరపై
- October 30, 2016
జీఆర్కు జోడీగా వెండితెరకు పరిచయమై, దక్షిణాది మొత్తాన్ని తన అందం, అభినయంతో అలరించిన అలనాటి తార లత మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు. యువతారలు ఆరి, ఆస్నాజవేరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'నాగేష్ తిరైయరంగం' చిత్రంలో ఆమె గిరిజన స్ర్తీగా వ్యత్యాసమైన పాత్రలో నటిస్తున్నారు. 'అగడం' ఫేమ్ మహ్మద్ ఇసాక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్నటి సితార ముఖ్య పాత్రలో నటిస్తోంది. వెండితెర పునరాగమనంపై లత స్పందిస్తూ... 'ఈ సినిమాలో గిరిజన స్ర్తీ పాత్ర నేనే పోషించాలని దర్శకుడు పట్టుబట్టారు. కథ కూడా నచ్చడంతో అంగీకరించాను. నా పునరాగమనానికి మంచి పాత్ర లభించిందని నమ్ముతున్నాను' అని పేర్కొన్నారు.గిరిజన ప్రజల సంక్షేమ కోసం, వారికి విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం కోసం పోరాడే గిరిజన స్ర్తీ పాత్రలో లత నటిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్









