దర్శకురాలిగా ఘట్టమనేని మంజుల....
- October 30, 2016
ది నుంచి సినీ రంగంలో వారసురాళ్ల హవా కనిపిస్తోంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ఇప్పటికే తన సత్తా చాటగా, మరింత మంది తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ఒక సూపర్ స్టార్ కి కుమార్తె, మరో సూపర్ స్టార్ కి సోదరి ఘట్టమనేని వారసురాలు మంజుల చాలా క్రితమే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. నటిగానూ గుర్తింపు తెచ్చుకొని 'షో' లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. అయితే నిర్మాతగా కొన్ని ఫెయిల్యూర్స్ ను చవిచూడాల్సి వచ్చింది. దీంతో కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోన్న మంజుల... తాజాగా మరోసారి సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమౌతోంది. అయితే ఈసారి నటిగానో, నిర్మాతగానో కాకుండా దర్శకురాలిగా సత్తాచాటేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే ఓ కథ రెడీ చేసిన మంజుల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుందని.. ఇండస్ట్రీలో వినవస్తున్న సమాచారం.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







