దర్శకురాలిగా ఘట్టమనేని మంజుల....
- October 30, 2016
ది నుంచి సినీ రంగంలో వారసురాళ్ల హవా కనిపిస్తోంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ఇప్పటికే తన సత్తా చాటగా, మరింత మంది తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ఒక సూపర్ స్టార్ కి కుమార్తె, మరో సూపర్ స్టార్ కి సోదరి ఘట్టమనేని వారసురాలు మంజుల చాలా క్రితమే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. నటిగానూ గుర్తింపు తెచ్చుకొని 'షో' లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. అయితే నిర్మాతగా కొన్ని ఫెయిల్యూర్స్ ను చవిచూడాల్సి వచ్చింది. దీంతో కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోన్న మంజుల... తాజాగా మరోసారి సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమౌతోంది. అయితే ఈసారి నటిగానో, నిర్మాతగానో కాకుండా దర్శకురాలిగా సత్తాచాటేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే ఓ కథ రెడీ చేసిన మంజుల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుందని.. ఇండస్ట్రీలో వినవస్తున్న సమాచారం.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









