బ్యాంకులకు సీవీసీ స్పష్టీకరణ

- October 31, 2016 , by Maagulf
బ్యాంకులకు సీవీసీ స్పష్టీకరణ

విజయ్‌ మాల్యా తరహాలో భారీ రుణ ఎగవేత ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) కొన్ని చర్యలు చేపట్టింది. రూ.కోటికి మించిన ఎగవేత అంశాలను తప్పనిసరిగా తన దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్పష్టంచేసింది. వీటిని పరిశీలించి.. సీబీఐ విచారణకు ఆదేశించాలా వద్దా అన్నదానిపై సిఫార్సులు చేస్తుంది. ఈ అంశంలో సహకరించడానికి సీవీసీ ఇప్పటికే నలుగురు జనరల్‌ మేనేజర్‌ స్థాయి బ్యాంకు అధికారులను సలహాదారులుగా నియమించుకుంది. 2015లో బ్యాంకు మోసాలకు సంబంధించి రూ.20,646 కోట్లతో ముడిపడిన 171 కేసులను సీబీఐ దర్యాప్తు చేసింది.రూ.50 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించడానికి నెలనెలా రిజర్వు బ్యాంకు, సీబీఐ, బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించాలని కూడా సీవీసీ నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com