బ్యాంకులకు సీవీసీ స్పష్టీకరణ
- October 31, 2016
విజయ్ మాల్యా తరహాలో భారీ రుణ ఎగవేత ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కొన్ని చర్యలు చేపట్టింది. రూ.కోటికి మించిన ఎగవేత అంశాలను తప్పనిసరిగా తన దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్పష్టంచేసింది. వీటిని పరిశీలించి.. సీబీఐ విచారణకు ఆదేశించాలా వద్దా అన్నదానిపై సిఫార్సులు చేస్తుంది. ఈ అంశంలో సహకరించడానికి సీవీసీ ఇప్పటికే నలుగురు జనరల్ మేనేజర్ స్థాయి బ్యాంకు అధికారులను సలహాదారులుగా నియమించుకుంది. 2015లో బ్యాంకు మోసాలకు సంబంధించి రూ.20,646 కోట్లతో ముడిపడిన 171 కేసులను సీబీఐ దర్యాప్తు చేసింది.రూ.50 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించడానికి నెలనెలా రిజర్వు బ్యాంకు, సీబీఐ, బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించాలని కూడా సీవీసీ నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









