ఐదేళ్ల తర్వాత సొంతగడ్డకు బళ్లారికి చేరుకోనున్నా గాలి...
- October 31, 2016
గనుల అక్రమ తవ్వకం ఆరోపణలపై 2011 సెప్టెంబరు 5న అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి ఐదేళ్ల తర్వాత తొలిసారిగా సొంతగడ్డ బళ్లారికి చేరుకోనున్నారు. నవంబరు 16న కుమార్తె బ్రహ్మణి వివాహం నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి 21 వరకు ఆయన బళ్లారిలో ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2011 సెప్టెంబరు 5న బళ్లారిలోని జనార్దన్రెడ్డి ఇంటి నుంచి సీబీఐ ఆయన్ను అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించింది. తర్వాత 2012 ఆగస్టు 16న బందోబస్తు మధ్య ఆయన్ను బళ్లారికి తీసుకొచ్చి అదే రోజు రాత్రి ఇక్కడి కేంద్ర కారాగారానికి తరలించింది. అనంతరం హైదరాబాద్, బెంగళూరులలో జనార్దన్రెడ్డి మూడున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపారు.తర్వాత బెయిలుపై విడుదలైనా బళ్లారికి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించలేదు. ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం లభించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









