ఐదేళ్ల తర్వాత సొంతగడ్డకు బళ్లారికి చేరుకోనున్నా గాలి...
- October 31, 2016
గనుల అక్రమ తవ్వకం ఆరోపణలపై 2011 సెప్టెంబరు 5న అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి ఐదేళ్ల తర్వాత తొలిసారిగా సొంతగడ్డ బళ్లారికి చేరుకోనున్నారు. నవంబరు 16న కుమార్తె బ్రహ్మణి వివాహం నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి 21 వరకు ఆయన బళ్లారిలో ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2011 సెప్టెంబరు 5న బళ్లారిలోని జనార్దన్రెడ్డి ఇంటి నుంచి సీబీఐ ఆయన్ను అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించింది. తర్వాత 2012 ఆగస్టు 16న బందోబస్తు మధ్య ఆయన్ను బళ్లారికి తీసుకొచ్చి అదే రోజు రాత్రి ఇక్కడి కేంద్ర కారాగారానికి తరలించింది. అనంతరం హైదరాబాద్, బెంగళూరులలో జనార్దన్రెడ్డి మూడున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపారు.తర్వాత బెయిలుపై విడుదలైనా బళ్లారికి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించలేదు. ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం లభించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







