బొగ్గు గనిలో ఘోర విషాదం
- November 02, 2016
చైనాలోని లౌసు నగరంలోని బొగ్గు గనిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలోని జిన్షాంగోవు గనిలో సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ప్రమాదంలో 33 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అయితే ఆ 33 మంది కార్మికులు మరణించినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. ప్రమాదం సమయంలో 35 మంది గనిలో పనిచేస్తుండగా.. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరణించిన 33 మందిలో 18 మంది మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించారు. మిగతా మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో, వినియోగంలో కూడా చైనాదే ప్రథమ స్థానం.దేశంలో అధిక సంఖ్యలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







