బొగ్గు గనిలో ఘోర విషాదం

- November 02, 2016 , by Maagulf
బొగ్గు గనిలో ఘోర విషాదం

చైనాలోని లౌసు నగరంలోని బొగ్గు గనిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలోని జిన్షాంగోవు గనిలో సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ప్రమాదంలో 33 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అయితే ఆ 33 మంది కార్మికులు మరణించినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. ప్రమాదం సమయంలో 35 మంది గనిలో పనిచేస్తుండగా.. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరణించిన 33 మందిలో 18 మంది మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించారు. మిగతా మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో, వినియోగంలో కూడా చైనాదే ప్రథమ స్థానం.దేశంలో అధిక సంఖ్యలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com