అల్ ఖోర్లో అన్ని ప్రభుత్వ సర్వీసులు ఒకే గొడుగు కిందికి
- November 03, 2016
అల్ ఖోర్లో నివసిస్తున్న సిటిజన్స్ అలాగే వలసదారులు ఇకపై అన్ని ప్రభుత్వ సర్వీసులు ఒకే గొడుగు కింద పొదే అవకాశం కలుగుతోంది. న్యూ అల్ ఖోర్ సర్వీస్ సెంటర్ ఇందుకు మార్గం సుగమం చేస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ స్టాఫ్ మేజర్ జనరల్ సాద్ బిన్ జస్సిమ్ అల్ కులైఫి, ఈ సరికొత్త కేంద్రాన్ని ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటరీయర్కి సంబంధించిన పలు సౌకర్యాలు ఈ కేంద్రంలో లభిస్తాయి. వీటితోపాటు కొన్ని ఇతర ప్రభుత్వ సర్వీసులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. 19 కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నామనీ, మరో 4 కేంద్రాలు త్వరలో ఓపెన్ అవుతాయని ఆయన తెలిపారు. రస్ లఫ్ఫాన్, పెరల్ ఖతార్, రువైస్ ప్రాంతాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. పాస్పోర్ట్లు, ఫింగర్ ప్రింట్స్, క్రిమినల్ ఇన్ఫర్మేషన్, ఎవిడెన్సెస్ వంటివాటికి సంబంధించి అధునాతన డివైజెస్తో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. వీసా, రెసిడెన్స్, ఎగ్జిట్ పర్మిట్, కంపెనీ రిజిస్ట్రేషన్ రెన్యువల్, రిక్రూట్మెంట్ కమిటీ సర్వీసులు ఒకే గొడుగు కింద అందుబాటులోకి రావడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ లైసెన్సులు, వర్క్, కాంట్రాక్టులు, బిల్ పేమెంట్లు కూడా అల్ కోర్ సర్వీస్ సెంటర్లో లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







