గుజరాత్‌కి చెందిన మరో వజ్రాల వ్యాపారి మంచి మనసు ...

- November 05, 2016 , by Maagulf
గుజరాత్‌కి చెందిన మరో వజ్రాల వ్యాపారి మంచి మనసు ...

ఇటీవల గుజరాత్‌కి చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు దీపావళి బోనస్‌గా అందించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరో డైమండ్‌ వ్యాపారి అతని సంస్థలో ఉండే 300 మంది ఉద్యోగులను కుటుంబాలతో సహా అంటే దాదాపు 1,200 మందిని 10రోజుల పాటు ఉత్తరాఖండ్‌ విహారయాత్రకు తీసుకెళ్లారు.గోవింద్‌ ఢోలకియా సూరత్‌, ముంబయిలలో శ్రీరామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ పేరుతో డైమండ్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.ఇటీవల ఆయన సంస్థలోని ఉద్యోగులందరికీ 10 రోజులు సెలవులు ప్రకటించారు. రూ.90లక్షలు పెట్టి ప్రత్యేకంగా ఏసీ ట్రైన్‌ బుక్‌ చేసి మరీ వారినీ విహార యాత్రకు తీసుకెళ్లారు.సంస్థకు చెందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ సంస్థ తరపున ఏటా ఇలాంటి యాత్రలుంటాయయని తెలిపారు. ఢోలకియా సంస్థలోని ఉద్యోగులందరినీ సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారని, వారితో కలిసి ప్రయాణిస్తారని తెలిపారు. ఈ యాత్రలో వారు వివిధ ప్రాంతాలను చూడటమే కాకుండా.. సామాజిక సేవలో కూడా పాల్గొంటారని తెలిపారు. గురువారం రిషికేశ్‌లోని స్వర్గాశ్రమ ప్రాంతాన్ని అక్కడి నగర పంచాయతీ సభ్యులతో కలిసి శుభ్రపరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గోవింద్‌ ఢోలకియాను కలవాలనుకున్న మీడియా ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనకు తన గురించి ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదని ఒక ఉద్యోగి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com