నవంబర్ 10వ తేదీన అనంతపురంలో పవన్కళ్యాణ్ సభ...
- November 05, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ' కోసం ఓ స్పెషల్ సాంగ్ విడుదల అయింది. ప్రజల గుండె రగిలెరా.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ను పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ పాటను బద్రీనాయుడు రాయగా, ఎమ్మెస్ వాసు పాడారు.నవంబర్ 10వ తేదీన అనంతపురంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రాంగణంలో ఈ సభ జరగనుందని, దీనికి కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జనసేన వర్గాలు తెలిపాయి.ప్రత్యేక హోదా అంశంతో పాటు అనంత కరువు, సాగు తాగునీరు తదితర అంశాలపై కూడా పవన్ స్పందించనున్నారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగంపై అంతటా హాట్ టాపిక్ నెలకొంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







