ట్రాపిక్ ఉల్లంఘనలపై 4-జి కెమెరాల కన్ను
- November 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి చెందిన వాహనాలకు 4 జి ఎనేబుల్డ్ కెమెరాలను అమర్చి, ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టడానికి రంగం సిద్ధం చేసింది. ఎమర్జన్సీ కేసుల విషయంలోనూ అలాగే రెసిడెంట్స్కి మరింత భద్రతను అందించేందుకుగాను వీటిని వినియోగించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, ఈ లేటెస్ట్ సెక్రూరిటీ ప్రోగ్రామ్ - వెహికిల్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ని ఇటీవల ప్రదర్శించింది. 4జి ఎనేబుల్డ్ సిస్టమ్ ద్వారా మెరుగైన క్లారిటీతో వీడియోల్ని చిత్రీకరించి, కంట్రోల్ రూమ్లో వాటిని విశ్లేషించగలుగుతారు. తద్వారా ఉల్లంఘనల్ని గుర్తించడమే కాకుండా, అవసరానికి తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో ట్రాపిక్ని క్రమబద్దీకరించడం వీలవుతుంది. లెఖ్వియా, అల్ ఫజా వాహనాల్లో వీటిని అమర్చుతారు. గతంలో జిపిఎస్పై ఆధారపడి ట్రాపిక్ డిపార్ట్మెంట్ పనిచేసింది. ఈ కొత్త విధానం ద్వారా మెరుగైన ఫలితాల్ని సాధించగలమని ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. సంబంధిత శాఖల నుంచి సమాచారాన్ని సేకరించడం కూడా వేగవంతమవుతుంది ఈ విధానం ద్వారా.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







