ట్రాపిక్ ఉల్లంఘనలపై 4-జి కెమెరాల కన్ను
- November 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి చెందిన వాహనాలకు 4 జి ఎనేబుల్డ్ కెమెరాలను అమర్చి, ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టడానికి రంగం సిద్ధం చేసింది. ఎమర్జన్సీ కేసుల విషయంలోనూ అలాగే రెసిడెంట్స్కి మరింత భద్రతను అందించేందుకుగాను వీటిని వినియోగించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, ఈ లేటెస్ట్ సెక్రూరిటీ ప్రోగ్రామ్ - వెహికిల్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ని ఇటీవల ప్రదర్శించింది. 4జి ఎనేబుల్డ్ సిస్టమ్ ద్వారా మెరుగైన క్లారిటీతో వీడియోల్ని చిత్రీకరించి, కంట్రోల్ రూమ్లో వాటిని విశ్లేషించగలుగుతారు. తద్వారా ఉల్లంఘనల్ని గుర్తించడమే కాకుండా, అవసరానికి తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో ట్రాపిక్ని క్రమబద్దీకరించడం వీలవుతుంది. లెఖ్వియా, అల్ ఫజా వాహనాల్లో వీటిని అమర్చుతారు. గతంలో జిపిఎస్పై ఆధారపడి ట్రాపిక్ డిపార్ట్మెంట్ పనిచేసింది. ఈ కొత్త విధానం ద్వారా మెరుగైన ఫలితాల్ని సాధించగలమని ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. సంబంధిత శాఖల నుంచి సమాచారాన్ని సేకరించడం కూడా వేగవంతమవుతుంది ఈ విధానం ద్వారా.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







