నంది అవార్డులను ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
- November 05, 2016
రాష్ట్ర విభజన నేపథ్యంలో నంది అవార్డులను ఇవ్వడం ఆపేసారు. అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించినా అందుకు ఏపీ నుంచి సమాధానం రాకపోవడంతో సొంతంగా తెలంగాణ ప్రభుత్వమే అవార్డులను ఇవ్వనుంది.అందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన హైదరాబాద్లో చలన చిత్ర పురస్కారాల కమిటీ సమావేశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినట్లుగా నంది పేరిట కాకుండా తెలంగాణ పేరుతో అవార్డులు ఇవ్వాలని డిసైడ్ చేశారు. 2014 జూన్ రెండు నుంచి 2015 డిసెంబరు వరకు తెలంగాణలో నిర్మించిన చలన చిత్రాలకు కలిపి పురస్కారాలు ఇవ్వాలని కమిటీ పేర్కొంది. ఇక.. 2016 జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్మించే సినిమాలకు వచ్చే ఏడాది పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. అవార్డులను సైతం తెలంగాణ ప్రముఖులు పైడి జయరాజు, కాంతారావు, ప్రభాకర్రెడ్డి, దాశరథి, చక్రిల పేరిట అవార్డులు ఇవ్వాలని కమిటీ సూచించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









