నంది అవార్డులను ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

- November 05, 2016 , by Maagulf
నంది అవార్డులను ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర విభజన నేపథ్యంలో నంది అవార్డులను ఇవ్వడం ఆపేసారు. అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించినా అందుకు ఏపీ నుంచి సమాధానం రాకపోవడంతో సొంతంగా తెలంగాణ ప్రభుత్వమే అవార్డులను ఇవ్వనుంది.అందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన హైదరాబాద్‌లో చలన చిత్ర పురస్కారాల కమిటీ సమావేశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినట్లుగా నంది పేరిట కాకుండా తెలంగాణ పేరుతో అవార్డులు ఇవ్వాలని డిసైడ్ చేశారు. 2014 జూన్ రెండు నుంచి 2015 డిసెంబరు వరకు తెలంగాణలో నిర్మించిన చలన చిత్రాలకు కలిపి పురస్కారాలు ఇవ్వాలని కమిటీ పేర్కొంది. ఇక.. 2016 జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్మించే సినిమాలకు వచ్చే ఏడాది పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. అవార్డులను సైతం తెలంగాణ ప్రముఖులు పైడి జయరాజు, కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి, దాశరథి, చక్రిల పేరిట అవార్డులు ఇవ్వాలని కమిటీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com