నంది అవార్డులను ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
- November 05, 2016
రాష్ట్ర విభజన నేపథ్యంలో నంది అవార్డులను ఇవ్వడం ఆపేసారు. అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించినా అందుకు ఏపీ నుంచి సమాధానం రాకపోవడంతో సొంతంగా తెలంగాణ ప్రభుత్వమే అవార్డులను ఇవ్వనుంది.అందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన హైదరాబాద్లో చలన చిత్ర పురస్కారాల కమిటీ సమావేశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినట్లుగా నంది పేరిట కాకుండా తెలంగాణ పేరుతో అవార్డులు ఇవ్వాలని డిసైడ్ చేశారు. 2014 జూన్ రెండు నుంచి 2015 డిసెంబరు వరకు తెలంగాణలో నిర్మించిన చలన చిత్రాలకు కలిపి పురస్కారాలు ఇవ్వాలని కమిటీ పేర్కొంది. ఇక.. 2016 జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్మించే సినిమాలకు వచ్చే ఏడాది పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. అవార్డులను సైతం తెలంగాణ ప్రముఖులు పైడి జయరాజు, కాంతారావు, ప్రభాకర్రెడ్డి, దాశరథి, చక్రిల పేరిట అవార్డులు ఇవ్వాలని కమిటీ సూచించింది.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







