శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చోరీ

- November 05, 2016 , by Maagulf
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చోరీ

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది నిర్వాకం మరోసారి బట్టబయలయింది. నిజామాబాద్‌కు చెందిన దశరథ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాదిఖ్ శనివారం మధ్యాహ్నం జెడ్డా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం వారు లగేజీ సరి చూసుకోగా వారి బ్యాగులు చింపివేసి ఉండటం గమనించారు.
ఆ లగేజీలో ఉన్న 2,100 సౌదీ రియాల్స్, మూడు సెల్‌ఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. తమ బ్యాగులను చింపి వేసిన బ్యాగేజి సిబ్బందే వాటిని మాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com