నవంబర్ 25న మోహన్ లాల్ 'మన్యం పులి'
- November 05, 2016
మల్లూవుడ్ లో కలెక్షన్ల మోత మోగించిన మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'పులిమురుగన్' చిత్రాన్ని తెలుగులో 'మన్యం పులి' పేరిట విడుదల చేస్తున్నారు శ్రీ సర్వసతి ఫిల్మ్స్ అధినేత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఇప్పటికే 'మన్యం పులి' సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయిందని చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో మన్యం పులి ని నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత కృష్ణారెడ్డి ప్లాన్ చేస్తున్నారు. 'జనతా గ్యారేజ్' సినిమాతో మోహన్ లాల్ కి తెలుగునాటు ఫుల్ క్రేజ్ రావడంతో, అదే ఊపులో 'మన్యంపులి' సైతం భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









