బాదామి హరియాలి
- November 05, 2016
కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు - 5, పచ్చిమిర్చి - 4, బాదం తరగు - అరకప్పు, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు, మెంతి ఆకులు - అరకప్పు, ఉడికించిన బీన్స్ - 1 కప్పు, పచ్చిబఠాణి - 1 కప్పు, తాజా క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు, పంచదార - 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి - 1 టీ స్పూను, బిర్యాని ఆకు - 1, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పనీర్ తురుము - అలంకరణకు.
తయారుచేసే విధానం: బాదం తరుగుతో పాటు ఉల్లి కాడలు (తెల్లని భాగం మాత్రమే), కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో బిర్యాని ఆకుతో పాటు బాదం పేస్టు వేసి పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించాలి. ఇప్పుడు మెంతి ఆకులు, పచ్చిబఠాణి, ఉప్పు, పంచదార, జీలకర్ర పొడి కలిపి 8 నిమిషాల ఉంచాలి. తర్వాత ఉడికించిన బీన్స్, క్రీమ్ వేసి 3 నిమిషాలు తర్వాత పనీర్ తురుము చల్లి దించెయ్యాలి. నాన్, పరాటాలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







