ఘనంగా ముగిసిన 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్'
- November 06, 2016
ఫెరారీ వరల్డ్, అబుధాబి లో దీపావళి సందర్భముగా 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' వారం రోజుల పాటు భారత్ దేశంకి సంబంధించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.వివిధ రాష్ట్రాలవారు పాల్గొన్నారు.అందులో భాగంగా మన తెలంగాణ జాగృతి బృందం వారిచే మహిళలు సాంప్రదాయ దుస్తులలో బతుకమ్మ , దీపావళి పాటల మీద ప్రదర్శించిన నృత్యాలు మరియు చిన్నపిల్లలు కోయ వేషధారణలో ప్రదర్శించిన నృత్యం మరియు ముగింపులో జయ జయహే తెలంగాణ జనని జయకేతనం అను పాటతో తెలంగాణ తల్లి వేషధారణతో, తెలంగాణ పేరుతో ప్రదర్శించిన ఫ్లాకార్డ్స్ చూపరులను ఆకట్టుకొన్నాయి .
ఈ కార్యక్రమములో కిరణ్ కుమార్ పీచర,అరవింద్ బాబు రాగం కార్యక్రమ నిర్వాహకులకు మెమెంటో అందజేశారు మరియు కృతజ్ఞతలు తెలిపారు.
మన తెలుగు వారు కిరణ్ కుమార్ పీచర,అరవింద్ బాబు రాగం,రాజేష్ రాగం,శ్రీకాంత్ చిత్తర్వు,జయచంద్ర,అరవింద్ బొడ్ల,భరద్వాజ్వాల,సత్యనారాయణ గాంధారి,రాజు సట్ల తదితరులు పాల్గొన్నారు.











తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









