దక్షిణ సూడాన్ రాజధాని జూబా ప్రాంతంలో కాల్పులు
- November 07, 2016
దక్షిణ సూడాన్ రాజధాని జూబా ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. జూబాకు సమీపంలోని ఓ పట్టణంలో టీవీలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులపై ఓ ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. భద్రతాసిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సూడాన్ పోలీసు అధికారి డేనియల్ జస్టిన్ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదని చెప్పారు. .
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







