బ్రిటన్‌ ప్రధాని థెరిసా నేడు బెంగళూరు పర్యటించనున్నారు..

- November 07, 2016 , by Maagulf
బ్రిటన్‌ ప్రధాని థెరిసా  నేడు బెంగళూరు పర్యటించనున్నారు..

 బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరిసా మే మంగళవారం బెంగళూరులో పర్యటించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 7.45 గంటలకు దిల్లీలో బయలు దేరి 10.30 గంటలకు నగరానికి చేరుకుంటారు. ఇక్కడి ఒక హోటల్లో సీఎం సిద్ధరామయ్యతో సమావేశమవుతారు. అనంతరం 11.50 గంటలకు యలహంక సమీపంలోని స్టోనహళ్లి (తరహుణసే) ప్రభుత్వపాఠశాలను సందర్శిస్తారు. మధ్యా హ్నం 12.05 గంటలకు డైనమిక్స్‌ టెక్నాలజి సంస్థ కార్యాయలానికి చేరుకుంటారు. రక్షణ, వైమానిక సంస్థలకు ఇది విడి భాగాల్ని సరఫరా చేస్తుంది. బ్రిటన్‌లోనూ దీనికి మూడు శాఖలున్నాయి. సాయంత్రం 3 గంటలకు మహాత్మాగాంధీ రోడ్డు బార్టన్‌ సెంటర్లో కొందరు ప్రముఖులతో సమావేశమవుతారు.అనంతరం హలసూరులోని సోమేశ్వరాలయాన్ని సందర్శిస్తారు. 5 గంటలకు దిల్లీకి బయలుదేరి వెళతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com