రేపిస్టులకు సౌదీలో 52 ఏళ్ళ జైలు శిక్ష, 7వేల కొరడా దెబ్బలు..

- November 09, 2016 , by Maagulf
రేపిస్టులకు సౌదీలో  52 ఏళ్ళ జైలు శిక్ష, 7వేల కొరడా దెబ్బలు..

ఆ దేశంలో నేరం చేసినవారికి శిక్షలు కఠినంగా ఉంటాయి అని తెలిసి కూడా దుర్మార్గులు రెచ్చిపోతూనే ఉంటారు.  భర్త, కుమార్తె కళ్ళముందే మహిళపై అత్యాచారానికి పాల్పడినవారికి సౌదీ కోర్టు కఠిన శిక్ష విధించింది.  వారికి 52 ఏళ్ళ జైలు శిక్ష, 7వేల కొరడా దెబ్బలు విధిస్తూ తీర్పు చెప్పింది. అత్యాచారం చేసిన నలుగురిలో ఒకరు సుడాన్ కు చెందిన వారుకాగా, మిగిలిన ముగ్గురు సౌదీకి చెందినవారు.  మొత్తం జైలు జీవితంలో 50 విడతల్లో కొరడా దెబ్బల శిక్ష అమలు చేస్తారు.  వివరాల్లోకి వెళితే... నలుగురు నిందితులు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని చేతులు ఎలక్ట్రిక్ వైరుతో కట్టేసి, కత్తితో అతని భార్యను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అనంతరం 10 వేల సౌదీ రియాల్స్, ఎనిమిది మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్ళారు. నిందితులు నలుగురు మరోసారి కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.  ప్రాసిక్యూషన్ వాదనతో పాటు, ఆ కుటుంబం ఇరుగుపొరుగు వ్యక్తుల సాక్ష్యం, నిపుణుల నివేదికలు, డాక్టర్లు, టెక్నీషియన్లు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ఆ నలుగురు వ్యక్తులను దోషులుగా నిర్థారించింది.  ఇలాంటి శిక్షలు మన దేశంలో కూడా అమలు చేస్తే ఆడది అర్థరాత్రి ఒంటరిగా నడవాలన్న గాంధీ గారి కల నెరవేరకపోయినా కనీసం పగలైనా రోడ్డు మీదకు భయం లేకుండా వెళ్ళగలుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com