డిసెంబర్లో ముష్రిఫ్ నేచురల్ అడ్వెంచర్ పార్క్ ప్రారంభం
- November 10, 2016
దుబాయ్: దుబాయ్ మునిసిపాలిటీ తొలి నేచురల్ అడ్వెంచర్ పార్క్ని డిసెంబర్లో ప్రారంభించనుంది. ముష్రిఫ్ ఏరియాలో ఈ పార్క్ ఏర్పాటయ్యింది. ట్రైనింగ్ మరియు ఛాలెంజింగ్ గేమ్స్ అలాగే పిల్లలకు, పెద్దలకు కొండలు ఎక్కేందుకుగాను అన్ని ఏర్పాట్లు ఈ పార్క్లో చేయబడ్డాయి. దుబాయ్ మునిసిపాలిటీ అసెట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జుమా అల్ ఫకీ మాట్లాడుతూ, తొలి ఏడాదిలో 23,000 మందిని ఈ పార్క్ ఎట్రాక్ట్ చేస్తుందనీ, రెండో ఏడాదిలో 35,000 మంది విజిటర్స్ వస్తారనీ, నాలుగో ఏడాదిలో 69,000 మంది ఈ పార్క్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. రోజుకి 600 మంది ఈ పార్క్ని సందర్శించే అవకాశం ఉంది. కార్పొరేట్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్, టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్కి అనువుగా ఈ పార్క్ని తీర్చిదిద్దారు. స్కూల్స్కి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కోసం కూడా ఈ పార్క్ అనువుగా ఉండనుంది. ప్రకృతితో సాన్నిహిత్యం ప్రతి మానవుని విధి అని, యువతరం ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ప్రకృతితో మమేకమవడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా పార్క్స్ మరియు హార్టీ కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ అల్ అవధి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







