వ్యాపారం, మోసం
- August 28, 2015
ఒకరోజు అక్బర్, బీర్బల్ సాయంత్రం అలా చల్లగాలికి ఉద్యానవనంలో తిరుగుతూ మాట్లాడుకుంటున్నారు. మధ్యలో రాజుకు ఒక డౌట్ వచ్చింది. ఈ ప్రపంచంలో ఎక్కువ మోసగాళ్లు ఎవరుంటారు బీర్బల్ అని అడిగాడు అక్బర్. వ్యాపారస్తులు ప్రభూ! అని ఠక్కున సమాధానమిచ్చాడు బీర్బల్. వ్యాపారస్తులందరూ మోసగాళ్లంటే నేను నమ్మను. కొందరు మంచి వాళ్లుంటారు. కొందరు చెడ్డవాళ్లుంటారు అన్నాడు అక్బర్. లేదు ప్రభూ వ్యాపారంలో డబ్బు సాధించాలంటే వ్యాపారస్తులు ఏదో ఒక రకంగా చిన్నదో పెద్దదో మోసం చేసి తీరాల్సిందే అన్నాడు. అయితే నువ్వ నిరూపించగలవా అని పరీక్ష పెట్టాడు అక్బర్, బీర్బల్కి. అప్పుడు బీర్బల్ ఒక ఉపాయం ఆలోచించి రాజ్యంలోని వ్యాపారస్తులందరినీ పిలిపించి, అందరూ ఒక్కొక్క చెంబుడు పాలు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అందుకు వ్యాపారస్తులందరూ మరసటిరోజు ఉదయాన్నే ఒక మూత ఉన్న చెంబుల్లో పాలు తీసుకుని వచ్చారు. బీర్బల్ ఒక గదిలో ఒక పెద్ద మూత ఉన్న గంగాళాన్ని సిద్దం చేశాడు. వ్యాపారస్తుఃలందరూ తాము తీసుకొచ్చిన పాలను ఒక్కొక్కరిగా ఆ గంగాళంలో చెంబులు ఒంపి వెళ్లారు. బీర్బల్, అక్బర్తో సహా వచ్చి ఆ గంగాళంలోకి తొంగిచూడగా అందులో ఒక్క చుక్క కూడా పాలు లేవు. మొత్తం నీళ్లే ఉన్నాయి. చూశారా ప్రభూ వ్యాపారస్తులు ఎవరికి వారే మిగతావారు పాలు పోస్తారు కదా. నేను పోసే ఒక్క చెంబు నీళ్లు ఏం తేడాతెలుస్తుంది అనుకుని అందరూ నీళ్లే తీసుకువచ్చారు అన్నాడు. అప్పుడు బీర్బల్ ఉపాయానికి, మెచ్చుకుని అతని సలహాలు అక్షరాలా నిజమయినవి అని అక్భర్, బీర్బల్ను అభినందించాడు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







