సునీల్,మన్నార చోప్రాల చిత్రం విషయాలు
- August 28, 2015
విశాఖలో వినోదాలు సునీల్ కథానాయకుడిగా ఆర్పీఏ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మన్నారా చోప్రా కథానాయిక. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాత. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాయకానాయికలు, ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. వచ్చేనెల రెండో వారంలో విశాఖపట్నంలో నెలరోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది. కథ, కథనాల్లో మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. సునీల్ శైలి వినోదం కూడా ఉంటుంది. 'ప్రేమకథా చిత్రమ్' తరవాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. సప్తగిరి పంచే వినోదం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందన్నారు. కబీర్ సింగ్, గొల్లపూడి మారుతీరావు, నాగినీడు, సత్యప్రకాష్, ప్రదీప్ రావత్, రాజా రవింద్ర, అదుర్స్ రఘు, ఉదయ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దినేష్, సహ నిర్మాతలు: ఆర్.ఆయుష్రెడ్డి, ఆర్.పి.అక్షిత్ రెడ్డి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







