సునీల్,మన్నార చోప్రాల చిత్రం విషయాలు
- August 28, 2015
విశాఖలో వినోదాలు సునీల్ కథానాయకుడిగా ఆర్పీఏ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మన్నారా చోప్రా కథానాయిక. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాత. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాయకానాయికలు, ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. వచ్చేనెల రెండో వారంలో విశాఖపట్నంలో నెలరోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది. కథ, కథనాల్లో మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. సునీల్ శైలి వినోదం కూడా ఉంటుంది. 'ప్రేమకథా చిత్రమ్' తరవాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. సప్తగిరి పంచే వినోదం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందన్నారు. కబీర్ సింగ్, గొల్లపూడి మారుతీరావు, నాగినీడు, సత్యప్రకాష్, ప్రదీప్ రావత్, రాజా రవింద్ర, అదుర్స్ రఘు, ఉదయ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దినేష్, సహ నిర్మాతలు: ఆర్.ఆయుష్రెడ్డి, ఆర్.పి.అక్షిత్ రెడ్డి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









