సునీల్,మన్నార చోప్రాల చిత్రం విషయాలు
- August 28, 2015
విశాఖలో వినోదాలు సునీల్ కథానాయకుడిగా ఆర్పీఏ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మన్నారా చోప్రా కథానాయిక. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాత. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాయకానాయికలు, ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. వచ్చేనెల రెండో వారంలో విశాఖపట్నంలో నెలరోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది. కథ, కథనాల్లో మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. సునీల్ శైలి వినోదం కూడా ఉంటుంది. 'ప్రేమకథా చిత్రమ్' తరవాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. సప్తగిరి పంచే వినోదం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందన్నారు. కబీర్ సింగ్, గొల్లపూడి మారుతీరావు, నాగినీడు, సత్యప్రకాష్, ప్రదీప్ రావత్, రాజా రవింద్ర, అదుర్స్ రఘు, ఉదయ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దినేష్, సహ నిర్మాతలు: ఆర్.ఆయుష్రెడ్డి, ఆర్.పి.అక్షిత్ రెడ్డి.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







