అమ్నెస్టీని వినియోగించుకోవాల్సిందిగా ఇండియన్‌ ఎంబసీ సూచన

- November 11, 2016 , by Maagulf
అమ్నెస్టీని వినియోగించుకోవాల్సిందిగా ఇండియన్‌ ఎంబసీ సూచన

 ఇండియన్‌ అంబాసిడర్‌ పి.కుమరన్‌, అక్రమ నివాసితులు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ నిర్వహిస్తోన్న అమ్నెస్టీని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూడు నెలల అమ్నెస్టీని సెప్టెంబర్‌ 2న మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ప్రకటించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అక్రమ నివాసితులు ఖతార్‌ని విడిచిపెట్టాల్సి ఉంది. ఈ స్కీమ్‌ డిసెంబర్‌ 1తో ముగుస్తుంది. అమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఇండియన్‌ ఎంబసీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని కుమరన్‌ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఇప్పటిదాకా 1,500 మంది భారతీయులు అమ్నెస్టీని వినియోగించుకున్నారనీ, ఇందులో 150 మందికి పాస్‌పోర్టులు లేవన్నారు. అవసరమైనవారందరికీ ఎంబసీ అత్యవసర పాసుల్ని మంజూరు చేసిందన్నారు. ఎమర్జన్సీ పాసుల కోసం వసూలు చేయాల్సిన 60 ఖతారీ రియాల్స్‌ని మినహాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు. అలాగే 500, 1000 రూపాయల నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా, అలాంటి నోట్ల విషయమై ఖతార్‌లోనివారికి సమాచారం ఇచ్చేందుకుగాను భారత ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్‌ కోసం ఎదురుచూస్తోంది ఎంబసీ. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com